వస్తావా అంటే అర్థం తెలియక సరే అన్నా.. ఎక్కడెక్కడో టచ్ చేసేవారు.. కీర్తి భట్ షాకింగ్ కామెంట్స్!

తెలుగులో సీరియళ్ల ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా కీర్తి భట్( Keerti Bhatt ) పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా కీర్తి భట్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్లలో ఒకరైన కీర్తిభట్ కన్నడ అమ్మాయి కాగా మనసిచ్చి చూడు అనే సీరియల్ తో తెలుగులో ఈమె ప్రయాణం మొదలైంది.కార్తీకదీపం సీరియల్ లో కూడా కీర్తి భట్ నటించారు.

ప్రస్తుతం కీర్తి భట్ మధురానగరి ( Maduranagari ) అనే సీరియల్ లో నటిస్తున్నారు.కొన్ని వారాల క్రితం కుమారి ఆంటీ హోటల్ ఫుడ్ ఏ మాత్రం బాలేదని కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

నా ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగళూరుకు తీసుకెళ్లారని అక్కడే నేను 35 రోజులు ఉండాల్సి వచ్చిందని కీర్తి భట్ తెలిపారు.ఆ సమయంలో నేను చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారని టచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ స్పర్శ లేకపోవడం వల్ల వాళ్లను నెట్టేయడానికి అవసరమైన బలం నాకు ఉండేది కాదని కీర్తి భట్ అన్నారు.అక్కడ కోలుకున్న తర్వాత నేను ఎవరికీ చెప్పకుండా వచ్చేశానని ఆమె తెలిపారు.ఎక్కడికైనా వెళ్లాలంటే డబ్బులు ఉండాలని ఆటో వాళ్ల దగ్గరికి వెళ్తే 200 ఇస్తే వస్తావా అని అంటే సరే వస్తానని చెప్పేదాన్నని కీర్తి భట్ పేర్కొన్నారు.

ఆ తర్వాత వాళ్ల లుక్ చూసి అసలు విషయం అర్థమయ్యేదని కీర్తి భట్ పేర్కొన్నారు.కీర్తి భట్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.కీర్తి భట్ కెరీర్ రాబోయే రోజుల్లో మరింత పుంజుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

కీర్తి భట్ తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు