ఇటీవల రోజుల్లో ఎవరిని కదిలించినా అధిక బరువుతో బాధపడుతున్నామనే చెబుతున్నారు.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఒత్తిడి, మద్యపానం వంటివి అధిక బరువుకు ప్రధాన కారణాలు.
బరువు పెరిగితే పెరిగాములే అని వదిలేస్తే మధుమేహం, గుండె జబ్బులు, జీవక్రియ రుగ్మతలు తలెత్తే అవకాశాలు పెరుగతాయి.అందకే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.
అందుకే చాలామంది బరువు తగ్గడం కోసం ఆహారంలో ఎన్నెన్నో మార్పులు చేర్పులు చేసుకుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ను తీసుకుంటే మీరు మల్లెతీగలా మారడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా బాగా పండిన పైనాపిల్ను తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్కను చెక్కేయాలి.ఇలా చెక్కేసిన పైనాపిల్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు, కొద్దిగా మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అర స్పూన్ అల్లం తరుగు, అర స్పూన్ పచ్చి పసుపు కొమ్ము తరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఫ్యాట్ బర్న్ డ్రింక్ సిద్ధమైనట్లే.
వారంలో మూడంటే మూడు సార్లు ఈ డ్రింక్ను తీసుకుంటే.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోయి సన్నగా మారతారు.అలాగే ఈ డ్రింక్ను డైట్లో చేర్చుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే నయం అవుతాయి.
మరియు జీర్ణ సంబంధిత సమస్యలు సైతం దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.