బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavita )కీలక వ్యాఖ్యలు చేశారు.కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు.
ఇది మనీలాండరింగ్( Money laundering ) కాదన్న ఆమె పొలిటికల్ లాండరింగ్ అంటూ విమర్శించారు.తనను తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని కవిత పేర్కొన్నారు.
కానీ తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరని తెలిపారు.ఈ కేసులో మొదటి నిందితుడు బీజేపీలో( BJP ) చేరారని ఆమె వెల్లడించారు.
అలాగే రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు.మూడో నిందితుడు బీజేపీకి రూ.50 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని పేర్కొన్నారు.తాను అఫ్రూవర్ గా మారడం లేదని తెలిపారు.
అయితే ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.