అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) ఆ పార్టీ నేతలను ఎంతో కలవరానికి గురి చేసిన సంగతి తెలిసిందే.రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు.

 Nara Bhuvaneshwari Assured The Farmers Of Amaravati Details,  Tdp, Nara Bhuvanes-TeluguStop.com

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమహేంద్రవరం లోనే ఉంటున్నారు.చంద్రబాబు అరెస్టు తర్వాత రోజు నుండి కుటుంబ సభ్యులు అక్కడే ఉంటూ.

నిరసనలు చేపడుతూ మరో పక్క న్యాయపోరాటం చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా అమరావతి రైతులు( Amaravati Farmers ) రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరుని కలిసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రైతులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది అని స్పష్టం చేశారు.రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడు చెబుతుండే వారు.

ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుంది అని అమరావతి రైతులకు భువనేశ్వరి ధైర్యం చెప్పారు.కచ్చితంగా చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని స్పష్టం చేశారు.మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతి రైతులు చేస్తున్న పోరాటం అంత తెలుసని అంతా ధైర్యంగా ఉండాలని చంద్రబాబు బయటకు వస్తారని మంచి రోజులు వస్తాయని రైతులందరికీ నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube