విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇటీవల షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.
కాగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో వెంకీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే వేసవి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు వరుసబెట్టి క్యూ కట్టాయి.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం కూడా మే 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అయ్యింది.దీంతో వెంకటేష్-చిరంజీవిల మధ్య బాక్సాఫీస్ వార్ ఖాయమని తేలిపోయింది.
అయితే కరోనా కారణంగా గతేడాది టాలీవుడ్కు వచ్చిన నష్టాలను దృష్టిలో పెట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వార్ లేకుండా ఉండేలా చూస్తున్నారు నారప్ప చిత్ర యూనిట్.అందుకోసం తమ చిత్ర రిలీజ్ డేట్ను ముందుకైనా, వెనక్కి అయినా జరపాలని వారు భావిస్తున్నారు.
ఈ క్రమంలో రానా నటిస్తున్న విరాటపర్వం ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుండటం, ఆ తరువాత మే 13 వరకు ఎలాంటి సినిమా రిలీజ్కు రెడీగా లేకపోవడంతో ఈ సమయంలో నారప్ప చిత్రాన్ని రిలీజ్ చేయాలని వెంకీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.అటు ఆచార్య మే 13 తరువాత రవితేజ ఖిలాడి మే 28న వస్తుండటంతో ఆ రెండు చిత్ర మధ్య గ్యాప్ కూడా రిలీజ్కు అనువుగా ఉందని నారప్ప చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి బాక్సాఫీస్ వార్ తప్పించుకునేందుకు నారప్ప ముందుకెళ్తాడా లేక వెనక్కి వెళ్తాడా అనేది చూడాలి.