ఏపీలో టీడీపీ- జనసేన – బీజేపీ పొత్తుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.ఇది నీతివంతమైన కలయికేనా అని ప్రశ్నించిన ఆయన ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.
గతంలో మోదీ, చంద్రబాబు పరస్పరం విమర్శించుకోలేదా అని నిలదీశారు.మోదీని మాత్రమే కాకుండా ఆయన కుటుంబ అంశాలపై కూడా చంద్రబాబు మాట్లాడారని పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పిన మాటలనే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెబుతున్నారని విమర్శించారు.ఇలాంటి వారికి ఓటు ద్వారానే ప్రజలు సమాధానం చెప్తారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో 151కి పైగా స్థానాలతో జగన్ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.