ఢిల్లీ మెట్రో( Delhi Metro ) బ్రిడ్జి కింద ముగ్గురు పాఠశాల విద్యార్థులు బహిరంగంగా రొమాన్స్ చేస్తూ కెమెరాకి అడ్డంగా చిక్కారు.ఈ ముగ్గురి రొమాన్స్కి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో కలకలం రేపింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక బాలుడు ఇద్దరు అమ్మాయిలను ముద్దుపెట్టుకున్నాడు.
సంఘటన జరిగిన కచ్చితమైన తేదీ, ప్రదేశం గురించి తెలియ రాలేదు, సోషల్ మీడియా పోస్ట్లు ఇది ఢిల్లీ మెట్రో వంతెన కింద జరిగినట్లు సూచిస్తున్నాయి.“ఢిల్లీ మెట్రో బ్రిడ్జ్ కింద స్కూల్ డ్రెస్ లో ఉన్న పిల్లకాయలు కిస్ చేసుకుంటున్నారు” అనే క్యాప్షన్తో ‘@రాకా’ ట్విట్టర్ హ్యాండిల్ దీనిని షేర్ చేసింది.సోషల్ మీడియాలో ఈ వీడియోపై చాలా మంది పిల్లల చర్యలపై దిగ్భ్రాంతి, నిరాశను వ్యక్తం చేశారు.
కొందరు యువ తరం భవిష్యత్తును ప్రశ్నిస్తున్నారు, మరికొందరు ఈ సంఘటనను ఢిల్లీ మెట్రోతో అనుసంధానించారు, బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని సూచించారు.మెట్రో పరిసరాల్లో భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
నవంబర్ 20న షేర్ చేసిన ఈ వీడియో వేలకొద్దీ వ్యూస్ సంపాదించుకుంది.సోషల్ మీడియా యూజర్లు అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేశారు.“వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు వీరు ఇలాంటి చెత్త పనులు చేయకుండా చదువుకోరు?” అని ఒక నెటిజెన్ తిట్టిపోశారు.“ఇలా పబ్లిక్లో ప్రైవేట్ నువ్వు చేయడానికి తెగించడం చాలా బాధాకరం అసలు ఈ వయసులో ఆ పనులు ఏంటి?” అని మరొకరు వ్యాఖ్యానించారు.ఈ సంఘటన పిల్లల ప్రవర్తనపై పెరుగుతున్న ఆందోళనను, తల్లిదండ్రుల పెంపకాన్ని హైలైట్ చేసింది.