తెలుగులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే నగ్నం అనే చిత్రానికి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని ఆన్ లైన్ ద్వారా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్ విషయమై టాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ తన అధికారిక పేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించాడు.అయితే ఇందులో కత్తి మహేష్ తాను ఈ చిత్ర రివ్యూ ని రాస్తూ అందులో బడ్జెట్ లక్ష రూపాయలని రాయగా రామ్ గోపాల్ వర్మ తనకి స్వయంగా ఫోన్ చేసి ఈ చిత్రానికి మొత్తం బడ్జెట్ కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే అయ్యిందని చెప్పాడని పేర్కొన్నాడు.
దీంతో ప్రస్తుతం కత్తి మహేష్ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అంతేగాక కొంతమంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ అబద్ధాలు చెప్పడని, అంతేగాక ఆయన అలాంటి వ్యక్తి కూడా కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరికొంతమంది మాత్రం రామ్ గోపాల్ వర్మ కి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఉందని అందువల్లనే అంత తక్కువ బడ్జెట్లో సినిమాను రూపొందించారని అంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడడంతో రామ్ గోపాల్ వర్మ తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ ఎలాంటి ఖర్చు లేకుండా వాటిని ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు.
అయితే ఇటీవలే ఆన్ లైన్ ద్వారా విడుదల చేసినటువంటి “నగ్నం” చిత్రం దాదాపుగా 75 లక్షలకు పైగా వసూళ్లను సాధించింది.