జయహో బీసీ మహాసభపై వైసీప ముఖ్యనేతల సమావేశం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగింది.ఎంపీలు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ఈ నెల 7న జయహో బీసీ మహా సభకు వివిధ హోదాలో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు 80 వేలకు పైగా హాజరవుతారని తెలిపారు.సామాజిక న్యాయం జగన్కే సాధ్యమని, ఈ మూడున్నరేళ్లలోనే చాటి చెప్పారన్నారు.
బీసీలంతా తలెత్తుకుని తిరిగేలా గౌరవం ఇచ్చారని అన్నారు.
ఎంపీ ఆర్.
కృష్ణయ్య మాట్లాడుతూ.గతంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేశారన్నారు.
దేశానికి వెన్నెముక అయిన బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు.అభివృద్ధి అంటే అధికారంలో వాటా ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడమే.
బీసీల విషయంలో సీఎం ఇదే చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు.