జగిత్యాల జిల్లా కొండగట్టుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపటిలో చేరుకోనున్నారు.ఎన్నికల ప్రచార రథం వారాహికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.కొడిమ్యాల మండలం నాచుపల్లిలో నేతలతో పవన్ సమావేశం ఉండనుంది.
నారసింహా క్షేత్రాల సందర్శనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పవన్ పూజలు చేయనున్నారు.అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ కు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.కాగా ఇప్పటికే జన సైనికులతో పాటు అభిమానులు కొండగట్టుకు భారీగా చేరుకున్నారు.