ఇప్పటి వరకు తెలంగాణలో అమలైన లాక్డౌన్ ఒక ఎత్తు ఇప్పటి నుండి అమలైయ్యే లాక్డౌన్ ఒక ఎత్తు.అంటున్నారు తెలంగాణ పోలీసులు.
అసలు లాక్డౌన్ పెట్టిందే కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి, కానీ ఈ నిబంధనలను ప్రజలు దాదాపుగా పాటించడం లేదని గులాభి దొర పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇంకా ఎక్కువ అధికారాలు ఇచ్చారట.
ఇంకే ముంది ఈ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారట.
దీంతో మరింత అప్రమత్తం అయినా అధికారులు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయబోతున్నారట.సరిహద్దు దాటి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి రాకుండా బయటకు వెళ్లకుండా ఆంక్షలు అమలు చేయనున్నట్లుగా డీజీపీ తెలుపుతున్నారట.
ఇక ఏ వాహనం అయినా ఉదయం 10 గంటల తర్వాత రోడ్డుపై కనబడినా సీజ్ చేస్తామని, లాక్డౌన్ తర్వాత కోర్టుకు వచ్చి సీజ్ చేసిన వాహనాలు తీసుకోవలసి ఉంటుందని తెలుపుతున్నారు పోలీసులు కాబట్టి ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని వెల్లడిస్తున్నారు…
.