"హనుమాన్" సినిమా యూనిట్ ని అభినందించిన తెలంగాణ గవర్నర్..!!

ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన "హనుమాన్" సినిమా ( Hanuman Movie ) బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా( Teja Sajja ) నటించిన ఈ సినిమా.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యింది.ఈ క్రమంలో రిలీజ్ అయిన ప్రతి చోట విజయం సాధించింది.జనవరి 12వ తారీకు విడుదలైన ఈ సినిమా.200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది."హనుమాన్" సినిమా కంటే పెద్ద సినిమాలు విడుదలైన గాని ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

అతి తక్కువ బడ్జెట్ లో విఎఫ్ఎక్స్ అద్భుతంగా చూపించడం జరిగింది.ఈ సందర్భంగా సినిమా యూనిట్ ని చాలామంది ప్రముఖులు అభినందిస్తున్నారు.తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై.

"హనుమాన్" చిత్ర బృందాన్ని అభినందించారు.

Advertisement

"హనుమాన్" సినిమా విజయం ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు.విఎఫ్ఎక్స్ విజువల్స్ తో దర్శకుడు పనితీరు.హీరో తేజ సజ్జా నటననీ తమిళిసై( Governor Tamilisai ) కొనియాడారు.

"హనుమాన్" సినిమా విజయం సాధించటంతో ఇప్పుడు సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు."జై హనుమాన్"( Jai Hanuman ) పేరిట సీక్వెల్ రాబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆల్రెడీ తెలియజేయడం జరిగింది.2025లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు."జై హనుమాన్" సినిమాలో హనుమాన్ హీరో అని ఆ పాత్రని ఓ స్టార్ హీరో పోషించబోతున్నట్లు పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు సీక్వెల్ "జై హనుమాన్" పై సినీ లవర్స్ కి ఆసక్తి ఏర్పడింది.

యూఎస్ బైకర్లతో ఇండియన్ టూరిస్ట్‌ల ఫ్రెండ్లీ ఇంట్రాక్షన్ వైరల్..
Advertisement

తాజా వార్తలు