క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగిఉండాలి - సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా :క్యాన్సర్ వ్యాధి పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ సూచించారు.శనివారం తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావుపల్లి గ్రామం లో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వైద్యులచే క్యాన్సర్ వ్యాధి పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

 Everyone Should Be Aware Of Cancer Senior Civil Judge Radhika Jaiswal, Cancer,-TeluguStop.com

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తదితర వాటికి దూరంగా ఉండాలన్నారు.వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ నయం చేయవచ్చన్నారు.అదేవిధంగా చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, వైద్యులు రమేష్, లీలా శిరీష, న్యాయ సేవాధికార సభ్యులు ఆడేపు వేణు, మల్లేష్ యాదవ్, ఆంజనేయలు, అన్సార్ ఆలీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube