బీజేపీ, సీఎం జగన్ లపై సీపీఐ నారాయణ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) జరగనున్నాయి.ఈసారి ఎన్నికలలో పోటి వాతావరణం గట్టిగా ఉంది.

 Cpi Narayana Serious Comments On Bjp And Cm Jagan, Cpi Narayana, Bjp, Cm Jagan-TeluguStop.com

దీంతో ప్రజల ఆదరణ పొందుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రచారంలో రకరకాల హామీలు ప్రకటిస్తున్నారు.ఏపీ 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ( ycp ) ఒంటరిగా పోటీ చేస్తుంది.

తెలుగుదేశం జనసేన కూటమిగా మీద పోటీ చేయబోతున్నాయి.జాతీయ పార్టీలు కాంగ్రెస్ మరియు బీజేపీ సింగల్ గా పోటీ చేయనున్నట్లు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది.

ఇంకా 60 రోజులు మాత్రమే సమయం ఉండటంతో సీట్ల సర్దుబాటు.ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై పార్టీల అధినేతలు దృష్టి పెట్టడం జరిగింది.

ఈ క్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana )బీజేపీ, ఏపీ సీఎం జగన్ లపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.దేశంలో బీజేపీ అభివృద్ధి చేయకుండా రాముడిని అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తుందని విమర్శించారు.అంతేకాకుండా ఎన్నికల కోసమే ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ అని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో జగన్.మోదీ జపం చేస్తున్నారని మండి పడటం జరిగింది.ఆంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు.

చెల్లెలు షర్మిల విమర్శలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదు అంటూ సీపీఐ నారాయణ నిలదీశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube