ఏంటి? కరోనా వచ్చిన పరీక్షా రాశారా? ఆలా ఎలా రాయనిచ్చారు అధికారులు? పేపర్ ద్వారా కరోనా వైరస్ వ్యాపించదా ? అని మీకు కోపం వచ్చింది కదా! కోపం రావడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే అతనికి కరోనా పరీక్షా చెయ్యగా నెగటివ్ వచ్చిందని, కరోనా నుండి కోలుకున్నాడు అని క్షయ నివారణ విభాగం అధికారి రమేష్బాబు వివరణ ఇచ్చాడు.
ఇంకా ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.చిత్తూరు జిల్లా క్షయ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసే ఓ ఉద్యోగి కొవిడ్ బారిన పడగా.అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.జిల్లా క్షయ విభాగంలోని ఆర్ఎన్టీసీపీ కింద కొన్ని ఉద్యోగాల కోసం గతేడాది నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ఇంకా ఆ నోటిఫికేషన్ ప్రక్రియ అప్పట్లోనే పూర్తయినప్పటికీ ఒకరిద్దరికి ఉద్యోగం రాలేదనే కారణాలతో నోటిఫికేషన్ను రద్దు చేసారు.రద్దు చేసిన ఆ నోటిఫికేషన్ లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు మరోసారి విడుదల చేశారు.
దానికి సంబంధించి మంగళవారం పరీక్షలు నిర్వహించాగా ఆ పరీక్షలకే కోవిడ్ బాధితుడు హాజరయ్యాడు.ఆ బాధితుడుకు డీఎంహెచ్వో ఆదేశాలతోనే పరీక్షకు అనుమతించామని చెప్పారు.