దేశ వ్యాప్తంగా ఓటములతో కాంగ్రెసు పార్టీ దిక్కుతోచకుండా ఉంది.వచ్చే ఎన్నికల నాటికి బలం కూడదీసుకోవాలి.
ఇప్పడైతే కాలూ చేయి ఆడటంలేదు.దేశంలో అన్ని స్థాయిల్లో బాగా బలపడిపోయిన బీజేపీని ఓడించాలంటే ఇప్పుడున్న నాయకులకు శక్తి చాలదు.
అధినేత సోనియా గాంధీకి ఓపికలేదు.అనారోగ్యంతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నో ఆశలు పెట్టుకున్న యువరాజు రాహుల్ గాంధీ ఏమీ పట్టనట్లు ఉన్నారు.ఆయన నాయకత్వం మీద నాయకులకే కాదు ఆయనకూ నమ్మకం లేనట్లుగా ఉంది.
కొత్తగా కాంగ్రెసులో చేరేవారు ఎవరూ కనబడటంలేదు.ఏం చేయాలో దిక్కుతోచని హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ద్వారా ఓ ప్రకటన చేయించింది.ఏమిటది? ‘కాంగ్రెసు నుంచి వెళ్లిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్న పాత నాయకులంతా తిరిగి సొంత ఇంటికి రావాలహో’ అని.ఎన్సిపి నేత శరద్ పవార్, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్, తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్…ఇంకా ఎవరైనా ఉంటే వారందరూ కాంగ్రెసులోకి వచ్చేయాలట…! పాత వాళ్లతో కొత్త రక్తం ఎక్కిస్తే పార్టీ బలం పుంజుకుంటుందని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం.కాంగ్రెసుకు రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాబోతుంటే వీరు వచ్చి కాంగ్రెసులో ఎలా చేరతారు? ఎందుకు పనిచేస్తారు? పిలుపు ఇచ్చారు కదా.చూద్దాం ఎలా స్పందిస్తారో…!
.