ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరించడం ద్వారా, ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు.అదే సమయంలో రాబోయే ఇబ్బందులను ముందుగానే అర్థం చేసుకోవడంతో పాటు వాటిని ఎదుర్కోవటానికి సిద్ధం కావచ్చు.
ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం చెడు సమయం రాకముందే, దానిని గ్రహించడం ఉత్తమం.ఇంట్లో లేదా చుట్టుపక్కల జరిగే కొన్ని సంఘటనలను మనం గమనించడం ద్వారా చెడు సమయాలు రాబోతున్నాయనే సంకేతాలను పొందవచ్చు.
నీతిశాస్త్రంలో, అటువంటి 5 సంకేతాల గురించి తెలియజేశారు.ఇది కుటుంబంలో తలెత్తబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది.
1.ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం
ఆచార్య చాణక్యుడి విధానం ప్రకారం ఇంట్లో తులసి మొక్కను సంరక్షించాలి.అది ఎండిపోకూడదు.సనాతన ధర్మంలో తులసి మొక్క సంతోషకరమైన కుటుంబానికి సంకేతం.తులసి మొక్క ఎండిపోతే, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని గ్రహించండి
2.తరచూ గాజు పగలడం
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ఇంటిలో గాజు పగలడం అశుభం అది కుటుంబంలోని ఎవరికీ మంచి సంకేతం కాదు.ఇంటిలో గాజు పగలడం కారణంగా ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.పేదరికం ప్రారంభమవుతుంది.
3.పెద్దలను అవమానించడం
ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం పెద్దలను అవమానించిన ఇంట్లో ధనం, ఆనందం, శ్రేయస్సు ఎప్పుడూ ఉండవు.పెద్దలంటే గౌరవం కలిగివుండాలి.పెద్దవారిని తృణీకరిస్తే కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.
4.ఇంట్లో గొడవలు
గొడవ ఎప్పుడైనా మంచిదికాదు.
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబంలో తరచూ కలహాలు ఏర్పడుతుంటే అది మంచి సంకేతం కాదు.ఎందుకంటే ఎక్కడ గొడవలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నివసించదు.అలాంటి ఇంట్లో నివసించేవారు ఎంత కష్టపడి పనిచేసినా అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
5.నిత్య పూజ
ఆచార్య చాణక్య ప్రకారం, శాంతి, ఆనందం, శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా ప్రతీరోజూ పూజలు చేయాలి.ఇది ఇంటి శుద్ధికి దారితీస్తుంది.అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది.అదే సమయంలో నిత్యఆరాధన లేని ఇంటిలో ప్రతికూల ఫలితాలు వస్తాయి.