అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠ పురం లో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం లో తమన్ పాత్ర ఖచ్చితంగా మెజారిటీ గా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించడం వల్లే అల వైకుంఠ పురం లో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అంటూ అల్లు అర్జున్ సక్సెస్ మీట్ లో వ్యాఖ్యలు చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అప్పటి నుండి ఇప్పటి వరకు తమన్ జోరు కొనసాగుతోంది.తమన్ భీమ్లా నాయక్ సినిమా కు సంగీతాన్ని అందిస్తున్నాడు అనగానే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పవన్ రేంజ్ కు అతడు సరిపోతాడా అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు.ట్రైలర్ విడుదల సమయం లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ మాత్రం బాగా లేదు అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
టీజర్ లో బీజీఎం పర్వాలేదు కానీ ట్రైలర్ లో మరీ నాసిరకంగా ఉందంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఒక రేంజ్ లో విమర్శించారు.పవన్ అభిమానులు కూడా ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఆ సమయం లో తమన్ మాట్లాడుతూ మొత్తం ట్రైలర్ లోనే ఆశిస్తే ఎలా.కచ్చితంగా సినిమాలో మీరు ఆశించిన దానికి ఎక్కువే ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.అన్నట్లుగానే భీమ్లా నాయక్ సినిమాలో అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా ట్రైలర్ విడుదల సమయం లో తమన్ ని విమర్శించిన వారే సినిమా విడుదల తర్వాత ఆయన పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
భీమ్లా స్థాయిని థమన్ పెంచాడని పవన్ అభిమాను లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.తమన్ తదుపరి సినిమా సర్కారు వారి పాట.ఆ సినిమాకి కూడా తమన్ ఓ రేంజిలో సంగీతాన్ని అందింస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మహేష్ బాబు స్థాయికి తమన్ సంగీతం అందిస్తే మరింత జోష్ తో సినిమా ఉంటుందనిఅభిమానులు ఆసక్తిగా ఉన్నారు.