కాకతీయ యూనివర్సిటీ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్ వివరణ ఇచ్చారు.కేయూ విద్యార్థులను పోలీసులు తీవ్రంగా కొట్టారనేది అవాస్తవమని తేల్చి చెప్పారు.
యూనివర్సిటీలోని కంప్యూటర్లు, రికార్డులను విద్యార్థులు ధ్వంసం చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు.విద్యార్థులను అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగిందన్నారు.
ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో విద్యార్థులకు స్వల్ప గాయలు అయి ఉండొచ్చని చెప్పారు.అనుమానం ఉంటే విద్యార్థులకు మరెక్కడైనా టెస్టులు చేయించుకోవచ్చని తెలిపారు.
అయితే విద్యార్థులు విద్యాసంస్థపై దాడి చేయడం సరికాదన్న సీపీ రంగనాథ్ రాజకీయాలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు.చట్టవిరుద్ధంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.