ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతుందనే వార్తలు మనం వింటున్నాము.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛను, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కోత వంటివి చూస్జే ఆ బాబితా పెద్దదే.ఈ సంక్షోభం మధ్య, సీఎం వైఎస్ జగన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 19 సరికొత్త కార్లను కొనుగోలు చేసిందని ఏపీ సచివాలయ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. టయోటా తయారు చేసిన ఫార్చ్యూనర్ కారు ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.19 కార్లు సీఎం జగన్ భద్రత కోసం బుల్లెట్ ప్రూఫ్తో కస్టమైజ్ చేయబడ్డాయి. ఈ వాహనాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.15 కోట్లు వెచ్చించింది.మూడేళ్ల క్రితం జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తాడేపల్లి, జిల్లాలు, న్యూఢిల్లీలో ఆయన జర్నీ కోసం ఆరు కొత్త కార్లను కొనుగోలు చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఆరు కార్లు మంచి స్టాండెడ్లోనే ఉన్నాయి.
కొత్తగా కొనుగోలు చేసిన కార్లు అనవపరంమని పలువురు అధికారులు అంటున్నారు.
![Telugu Andhra Pradesh, Cm Convoy, Cmjagan, Toyota-Political Telugu Andhra Pradesh, Cm Convoy, Cmjagan, Toyota-Political](https://telugustop.com/wp-content/uploads/2023/01/andhra-pradesh-cm-jagans-convoy-gets-six-new-fortunersb.jpg )
కొత్తగా కొనుగోలు చేసిన 19 కార్లకు సంబంధించి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వం కార్లను కొనుగోలు చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.ఏప్రిల్ నెల తర్వాత సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం కూడా ఉంది, అందుకే అసెంబ్లీని రద్దు చేసేలోపు మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రమంతటా పర్యటించేందుకు ప్రభుత్వం కార్లను కొనుగోలు చేసిందనేది చర్చనీయాంశమైంది.నారా లోకేష్ ఈ నెలాఖరులో పాదయాత్రకు ప్లాన్ చేయడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, జనం తనవైపు మళ్లకుండా ఉండేందుకు సిఎం జగన్ ఇలాంటి ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. 19 కార్లు భారీ కాన్వాయ్, జగన్ బెటాలియన్తో ప్రజల్లోకి వెళ్లొచ్చు.