బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ( Anasuya ) భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కెరియర్ మొదట్లో పలు కార్యక్రమాలకు ఈ యాంకర్ గా వ్యవహరించిన ఈమెకు మాత్రం జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.ఇలా ఈ కార్యక్రమం ద్వారా అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం సినిమాలలో కూడా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.
ఈ విధంగా వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి అనసూయకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.సినిమాల పరంగా తన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఈమె తన అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే పోస్టులు పట్ల ఎన్నో వివాదాలు తలెత్తుతూ ఉంటాయి.ఇలా ఇప్పటికే ఈమె ఎన్నో వివాదాలలో చిక్కుకొని పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే.ఇలా తరచూ తన గురించి వచ్చే ట్రోల్స్ ( Trolles ) పై ఈమె ఘాటుగానే రియాక్ట్ అవుతూ వారికి తనదైన శైలిలోనే సమాధానాలు చెబుతూ ఉంటారు.అయితే తాజాగా మరోసారి ఈమె ట్రోలర్స్ ని గెలికారని చెప్పాలి.
తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.మీ గురించి ట్రోల్స్ చేసే వారి పట్ల మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న అనసూయకు ఎదురైంది.ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేసే వారిని ఏకంగా ఈమె చీడపురుగులతో పోల్చారు.
ట్రోలర్స్ అలాంటివారెనని, అలాంటి వాళ్లకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఈమె తెలియజేశారు.ఆ కంపు మనకు అంటకూడదు కదా అందుకే అలాంటి వారి గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ అంటూ ఈ సందర్భంగా ట్రోలర్స్ పై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఈమె చెప్పినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
వారి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అనసూయ వారిని రెచ్చగొట్టారని దీంతో మరోసారి ఈమెపై ట్రోల్స్ జరగడం తథ్యం అంటూ పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.