టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే.
ఇందులో రష్మిక, అల్లు అర్జున్ నటనకు గాను పలువురు ప్రముఖులు వారి పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమాతో బన్నీ కెరీర్లో తొలిసారిగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
అయితే వెండితెరపై ఈ సినిమా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.తాజాగా జనవరి 7న అమెజాన్ ప్రైమ్ వీడియో లో పుష్ప సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఓటీటీ లో ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్ అభిమానులు అలాగే పలువురు ప్రముఖులు మరొకసారి అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా యాంకర్ అనసూయ కూడా తన ఫ్యామిలీతో కలిసి మరొకసారి పుష్ప సినిమాను ఓటీటీ లో వీక్షించింది.
ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.నా సినిమా కెరీర్ కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది.
ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్ సుకుమార్ సార్ కు చాలా థ్యాంక్స్.ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడండి అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.పుష్ప సినిమాలో అనసూయ నటించిన విషయం తెలిసిందే.ఇందులో అనసూయ నటనకుగాను మంచి మార్కులు పడ్డాయి.ఇందులో మంగళం శ్రీను కి భార్యగా దాక్షాయని పాత్రలో నటించి మెప్పించింది.అయితే ఫస్ట్ పార్ట్ లో అనసూయ పాత్రకి తక్కువ ప్రాధాన్యత ఉంది.
కానీ పార్ట్ 2 లో మాత్రం అనసూయ క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుంది అని అర్థమవుతుంది.