టాలీవుడ్ లో ఇటీవలే సినిమాల సందడి మొదలు అయ్యింది.గత ఏడాది నవంబర్ నుండి సినిమా ల విడుదల హడావుడి కనిపిస్తుంది.2020 సంవత్సరం మార్చి నుండి ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా లు అనేవి విడుదల సాధ్యం కాలేదు.చిన్నా చితకా సినిమా లు విడుదల అయినా బాక్సాఫీస్ సందడి కనిపించలేదు.
ఇలాంటి సమయం లో నాని మరియు బాలయ్య సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఇదే సమయం లో పుష్ప సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఇలాంటి సమయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ కు ఆందోళన కలిగిస్తుంది.ఇప్పటికే ఉత్తరాదిన ఆంక్షల కారణంగా ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమా లు నిలిచి పోయాయి.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పై ఫోకస్ పెట్టిన సినిమా లు సంక్రాంతి కి విడుదల అవ్వాలనుకుంటే తెలంగాణలో థియేటర్ల వద్ద ఆంక్షలు తప్పవా అన్నట్లు గా ప్రచారం మొదలు అయ్యింది.కేసీఆర్ తాజాగా విద్యా సంస్థ లకు ఏకంగా పది రోజుల వరుస సెలవు దినాలను ప్రకటించాడు.
అదే కొనసాగితే థియేటర్ల కు కూడా ఆక్యుపెన్సీ తగ్గించడం లేదంటే మరో రకంగా ఆంక్షలు పెడితే థియేటర్ల లో సందడి చేయాలనుకుంటున్న సంక్రాంతి సినిమా ల పరిస్థితి ఏంటీ అంటూ ప్రతి ఒక్కరి లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది.టాలీవుడ్ నుండి సంక్రాంతి కి బంగార్రాజు కాకుండా మరో పది సినిమా లు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.పెద్ద సినిమా లు ఆంక్షలున్నా కూడా ఏదో విధంగా నడుస్తాయి.కాని చిన్న సినిమాలు కరోనా ఆంక్షల మద్య నడవడం అసాధ్యం.అందుకే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల వారికి కేసీఆర్ నిర్ణయం మింగుడు పడటం లేదు.