ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీ సుధ( Sri Sudha ) తక్కువ సినిమాల్లోనే నటించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ నటి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
నన్ను ఫిజికల్ గా టార్చర్ చేశారని ఆమె తెలిపారు.కన్ను ఎర్రగా అయిపోయి ఒక షూట్ కు కూడా వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.
శ్యామ్ కే నాయుడు( Shyam K Naidu )పై పెట్టిన కేసు ఇప్పుడు ట్రయల్ కు వస్తోందని శ్రీ సుధ కామెంట్లు చేశారు.
![Telugu Jeevitha, Shyam, Tollywood-Movie Telugu Jeevitha, Shyam, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/actress-sri-sudha-Jeevitha-Shyam-K-Naidu-tollywood.jpg)
షూట్ చేయకపోతే నాకు కెరీర్ లేదని కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నానని ఆమె తెలిపారు.నేను రాజీ పడ్డానని చాలామంది చెబుతున్నారని డబ్బుల గురించి అయితే ఎప్పుడో అయిపోయేదని శ్రీ సుధ అన్నారు.నాకు హెల్త్ సమస్యలు ఉన్నాయని ఆమె వెల్లడించారు.
రెండు నెలల పాటు నడవలేక కూడా ఇబ్బంది పడ్డానని శ్రీ సుధ అన్నారు.ఒంటినిండా చర్మానికి సంబంధించిన గాయాలు ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు.
![Telugu Jeevitha, Shyam, Tollywood-Movie Telugu Jeevitha, Shyam, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/09/sri-sudha-Jeevitha-Shyam-K-Naidu-tollywood-social-media-viral.jpg)
కోర్టు ఖర్చులు, అడ్వకేట్స్ కు ఇచ్చే ఖర్చులు భారీ రేంజ్ లో ఉంటాయని శ్రీ సుధ అన్నారు.నాకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని లోన్లు తీసుకుని ఈ.ఎం.ఐలు కడుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.జీవిత గారికి కాల్ చేసి చెప్పగా కేసు పెట్టేశావ్ కదా ఇంకేముంది అని జీవిత అన్నారని తెలిపారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో జీవిత( Jeevitha ) పని చేస్తుండటంతో నేను కాల్ చేసి చెప్పానని ఆమె పేర్కొన్నారు.
లక్ వల్లే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యానని శ్రీ సుధ కామెంట్లు చేశారు.యాక్టింగ్ ఇప్పుడు మెయిన్ ప్రొఫెషన్ అని ఆమె కామెంట్లు చేశారు.రామ్ కు సిస్టర్ రోల్ వస్తే రిజెక్ట్ చేశానని శ్రీ సుధ అన్నారు.రామ్ ను క్రష్ లా ఫీలవుతానని ఆమె వెల్లడించారు.
ఎందుకంటే ప్రేమంట సినిమాలో ఛాన్స్ ను మిస్ చేసుకున్నానని శ్రీ సుధ చెప్పుకొచ్చారు.