ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించిన చర్చ జరుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన కార్యక్రమాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా జరుగుతున్నాయి.
ఇక ఈ సినిమా గురించి ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా సోషల్ మీడియా లో వైరల్ అయి పోవచ్చు అనే ఉద్దేశం తో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కు సంబంధించి ఏదో ఒక ఆ విధంగా సోషల్ మీడియా లో యాక్టివ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా ఒక ఆర్టిస్టు తనదైన విభిన్న కల ను సినిమా ప్రమోషన్ లో భాగంగా వాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
టీ తాగే పేపర్ కప్పులు తీసుకొని వాటికి పెయింటింగ్ వేస్తూ ఒక్కొక్కటి అమర్చడం ద్వారా ఎన్టీఆర్ ఫోటోని ఆయన చూపించగలిగాడు.ఒక హీరో ఫోటోను చూపించడం కామన్ విషయం.
కానీ ఇతను చేసిన ఆర్ట్ లో అద్భుతం దాగి ఉంది.అది ఏంటి అంటే.
ఒక వైపు చూసినప్పుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించిన రామ్ చరణ్ కనిపించగా రెండవ వైపు చూసిన సమయంలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కనిపిస్తున్నారు.ఇద్దరు హీరోలు కల్పి చూపించడం అనేది చాలా గొప్ప విషయం.
ఈ ఆర్ట్ చాలా స్పెషల్ అంటూ ప్రతి ఒక్కరు అభినందనలు తెలియ జేస్తున్నారు.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రత్యేకంగా ఉంటుందని.ఆ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ఈ ప్రత్యేకమైన ఆర్ట్ ఉందని సోషల్ మీడియా లో జనాలు కామెంట్ చేస్తున్నారు.ఈ ఇద్దరి హీరోల తో పాటు జక్కన్న ఫోటో ను కూడా సైడ్ యాంగిల్లో చూస్తే వచ్చేలా డిజైన్ చేస్తే బాగుండేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఆలియా భట్ మరియు బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.