పెళ్లి వల్ల సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్న మంచు హీరో మనోజ్ మళ్లీ ఫీల్డ్లోకి వచ్చాడు.ప్రస్తుతం ఈయన ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దశరథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
‘మిస్టర్ పర్ఫెక్ట్’ తరహాలో ఒక మంచి ప్రేమకథతో పాటు, ఫ్యామిలీ కథను మంచు మనోజ్తో దర్శకుడు దశరథ్ తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో హీరోయిన్గా మెగా హీరోయిన్ రెజీనా నటిస్తోంది.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు టైటిల్ను తాజాగా ఫిక్స్ చేశారు.
ఇదో కుటుంబ కథా చిత్రం అయినా కూడా మాస్ ఆడియన్స్ను సైతం ఆకట్టుకునేలా ‘సౌర్య’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
అతి త్వరలో ఈ చిత్ర టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు.గతంలో వీరిద్దరి కాంభినేషన్లో ‘శ్రీ’ చిత్రం వచ్చింది.
ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.రెండవ ప్రయత్నంగా తెరకెక్కుతున్న ‘సౌర్య’ చిత్రం ఈ కాంబినేషన్కు సక్సెస్ను తెచ్చి పెడుతుందో చూడాలి.
ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో విడుదల చేసే అవకాశాలున్నాయి.