అన్నపూర్ణ స్టూడియోస్ను ఆంధ్రాబ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంకులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.అక్కినేని నాగార్జున మరియు ఇతర అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతలు ఈ రెండు బ్యాంకులకు 65 కోట్ల మేరుకు బాకీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంత పెద్ద ఫ్యామిలీ, ఎన్నో వ్యాపారాలు, మరెన్నో ఆస్తులు ఉన్న నాగార్జున ఈ చిన్న మొత్తం అప్పును కట్టేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అనే విషయంలో ఆసక్తికర చర్చ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది.నాగార్జున ఆ అప్పు కట్టే స్తోమత ఉన్నా కూడా కట్టడం లేదని, అన్నపూర్ణ స్టూడియోస్లోని ఆ ఏడున్నర ఎకరాలు పోయినా పర్వాలేదనే భావనలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫిల్మ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న గుసగుసల ఆధారంగా నాగార్జున హైదరాబాద్ వదిలి కొత్త రాజధాని అమరావతి లేదా వైజాగ్కు వెళ్లి పోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.అందుకే అన్నపూర్ణ స్టూడియోస్లో ఆ ఏడున్నర ఎకరాల ల్యాండ్ను బ్యాంకులు స్వాదీనం చేసుకున్నా స్పందించలేదు అంటున్నారు.
ఇటీవలే ఈయనకున్న మాటీవీలోని వాటాను విక్రయించినందుకు కనీసం 100 కోట్లు అయినా వచ్చి ఉంటాయని అంటున్నారు.ఇక్కడే ఉండాలనే ఉద్దేశ్యం ఉంటే నాగార్జున ఆ అప్పును చెల్లించే వాడని అంటున్నారు.
మరి నాగార్జున వెళ్లి ఆంధ్రప్రదేశ్లో స్టూడియోను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడేమో అని సినీ ప్రముఖులు సైతం అంటున్నారు.