మనలో చాలామంది ఏ విషయం సంబంధించి మనకు ఇష్టమైన ఆరాధ్య దైవాన్ని నమ్ముకోవడం చాలా కామన్.అయితే కొందరు కేవలం నమ్మకంతో పాటు వారికి చేతగిన పనులను కూడా చేస్తుంటారు.
ఇకపోతే తాజాగా వెలువడిన ఎన్నికల రిజల్ట్స్ కొందరు రాజకీయ నాయకులు విజయం సాధించాలని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో భాగంగానే ఓ ప్రముఖ వ్యక్తి చేసిన పూజలు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ విశేషాలు ఓసారి చూస్తే.
ప్రముఖ హీరోయిన్ రాధిక( Heroine Radhika ) ఈసారి తమిళనాడులోని విరుద్నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా( BJP Candidate ) పోటీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆవిడ విజయం సాధించాలని ఆయన భర్త ప్రముఖ నటుడు శరత్ కుమార్( Sarath Kumar ) ప్రత్యేక పూజలు నిర్వహించారు.విరుద్నగర్లోని శ్రీ పరాశక్తి మారియమ్మన్ ఆలయాన్ని రాధిక దంపతులు దర్శనం చేసుకున్న తర్వాత శరత్ కుమార్ ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో కాస్త లేటుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రాధిక శరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన బాగా కష్టపడ్డారు.అయితే మంగళవారం నాడు వెలబడిన ఫలితాలలో నటి రాధిక శరత్ కుమార్ ఓడిపోయారు.
నిజం చెప్పాలంటే తమిళనాడు రాష్ట్రంలో బిజెపి తరఫున పోటీ చేసిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించి బిజెపి పార్టీ ఒక్క సీటు కూడా నిజంగా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే అక్కడ బిజెపి పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోవడం కొసమెరుపు.