ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.ఆయన బిజినెస్లో ఎంత ఫేమసో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టీవ్గా ఉంటారు.
పారిశ్రామికవేత్త మనసుకు హత్తుకునే వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన శైలిలో వాటికో క్యాప్షన్ కూడా ఇస్తారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఏ వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతూ లక్షల్లో వ్యూస్ని సంపాదించుకుంటుంది.
తాజాగా ఆనంద్ మహీందా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను తన ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేశారు.ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియో గురించి మనం కూడా తెలుసుకుందాం.
వీడియోలో ఒక చిన్న ఫుడ్ ట్రక్కు( Food truck ) ఓ రోడ్డు చివర ఆగింది.అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ ఫుడ్ ట్రక్ ని క్షణాల్లోనే రెస్టారెంట్గా మార్చేశాడు.ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీని ఆ వ్యక్తి ఎంతో బాగా యూజ్ చేసున్నాడు.
అలానే ఈ ఫుడ్ ట్రక్ ని ఎక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటే అక్కడకు తీసుకెళ్లొచ్చు.దీని వల్ల వ్యాపారస్తుడికి లాభం కూడా చేకూరుతుంది.ఆ వ్యాపారస్తుడి సృజనాత్మకతకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయ్యాడు.వెంటనే ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.
ఆనంద్ మహీంద్రా ఆ వీడియోని షేర్ చేస్తూ ‘ మనసు ఉంటే మార్గం ఉంటుందని ఊరికే అనలేదు పెద్దలు.కష్ట పడాలి అనుకుంటే ఎన్నో దారులు ఉంటాయి.ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ట్రక్స్, ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్స్ వచ్చేసాయి.ఈ కొత్త బిజినెస్ ఐడియా చాలా బావుంది.ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడకు ఈ రెస్టారెంట్ ని వెళ్లొచ్చు’ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
వ్యాపారస్తుడి ఐడియాకు నెటిజన్లు కూడా ఫిదా అవుతూ, వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అంతేకాకుండా ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రాను కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.