బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో భాగంగా కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.ఇందులో భాగంగా అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి అందిస్తామని తెలిపారు.ఈ పథకానికి సౌభాగ్యలక్ష్మీ పథకంగా నామకరణం చేశారు.
అదేవిధంగా అర్హులైన వారికి రూ.400 కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలో గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కూడా రూ.400 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.దాంతోపాటు ఈహెచ్ఎస్ తరహాలో జర్నలిస్టులకు ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామన్నారు.కేసీఆర్ ఆరోగ్య రక్ష ప్రజలందరికీ ఆరోగ్య శ్రీ పథకమని పేర్కొన్నారు.కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.