మూత్రంలో మంట. ఎందరినో వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.వాటర్ను సరిగ్గా తీసుకోకపోవడం, మాంసాహారం అతిగా తినడం, మద్యపానం, ధూమపానం, టీ-కాఫీలు ఓవర్గా సేవించడం, ఫాస్ట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్, సాల్టీ ఫుడ్స్ తరచూ తినడం, యూరిన్ను ఆపుకోవడం, ఇన్ఫెక్షన్.
ఇలా రకరకాల కారణాల వల్ల మూత్రంలో మంట సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది.దీంతో ఆ సమస్య గురించి బయటకు చెప్పుకోలేక.
ఎలా నివారించుకోవాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను తెలుసుకుంటే చాలా సులభంగా ఈ సమస్యను నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు వాము, చిటికెడు పసుపు కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
ఇలా చేస్తే మూత్రంలో మంట సమస్య దూరం అవుతుంది.మరియు పచ్చగా మూత్రం వెళ్ళటం కూడా ఆగుతుంది.
అలాగే ఆరెంజ్, కర్బూజ, పుచ్చ, గ్రేప్స్ వంటి పండ్లతో జ్యూస్ తయారు చేసుకుని తరచూ సేవించాలి.ఇలా చేయడం ద్వారా కూడా మూత్రంలో మంట సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
మరియు రోజుకొక అరటి పండును ఖచ్చితంగా తినాలి.
తద్వారా మూత్రాశయ మార్గంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గు ముఖం పట్టి మంట రాకుండా ఉంటుంది.
ఒక క్యారెట్, ఒక యాపిల్.రెండింటినీ తీసుకుని జ్యూస్లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్లో పావు స్పూన్ సబ్జా గింజలు కలిపి తీసుకోవాలి.ఈ డ్రింక్ను రోజుకు ఒక సారి తీసుకుంటే మూత్రంలో మంట సమస్యే ఉండదు.
ఇక ఈ టిప్స్తో పాటు మద్యపానం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి.శరీరానికి సరిపడా నీటిని అందించాలి.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం చేయకూడదు.మరియు పోషకాహారం డైట్లో ఉండేలా చూసుకోవాలి.