త్వరలో జరగనున్న ఆసియా కప్ టోర్నీకి బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది.ఈ మేరకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించగా అందులో ఇటీవల గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కు స్థానం దక్కింది.
అదేవిధంగా ఈ టీమ్ లో హైదరాబాద్ కు చెందిన యువ కెరటం తిలక్ వర్మ జట్టులో స్థానాన్ని సంపాదించాడు.ఈనెల 30న ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్సర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు రిజర్వ్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.