వరంగల్ లోని అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో వివాదాలు క్రమక్రమంగా ముదురుతున్నాయి.ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కడియం టచ్ లో ఉన్నారని రాజయ్య ఆరోపించారు.
కూతురు టికెట్ కోసం కడియం కాంగ్రెస్ పార్టీతో బేరమాడుతున్నారన్నారు.కడియం అవినీతి చిట్టా విప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో కడియం చిచ్చు పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.