నల్లగొండ పట్టణంలోని 2 వ వార్డు పానగల్లులో పోలింగ్ బూత్ నెం.142,143,148,151 లలో శక్తి కేంద్ర ఇన్చార్జి మిర్యాల యాదగిరి అధ్వర్యంలో ప్రజాగోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు కన్మంతరెడ్డి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసామన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మిర్చి కొండా భవాని ప్రసాద్,బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్,దాసరి వెంకన్న,కట్ట వెంకటరెడ్డి,పోలింగ్ బూత్ అధ్యక్షులు జీవన్ గుజ్జ, వాసరాల మురళి,వేముల శేఖర్,గుండెలోని సందీప్, కార్యకర్తలు,మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Latest Latest News - Telugu News