టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ లపై ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కనీసం మంగళగిరిలో కూడా గెలువలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తెస్తారా అని ప్రశ్నించారు.
టీడీపీ శ్రేణులు నిజాలు తెలుసుకోవాలని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి సూచించారు.చంద్రబాబులా అబద్దపు హామీలు ఇచ్చే అలవాటు తమకు లేదన్నారు.
ఐదేళ్లలో అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు.రోజాను మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ రెండు, మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.