గుంటూరు తొక్కిసలాట ఘటనలో కుట్ర అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో రోడ్డు షో, సభలను నియంత్రించేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై జనసేన నాయకుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ జీవో తీరు చూస్తే అభద్రతాభావంతో వైసీపీ ఉన్నట్లు వ్యాఖ్యానించారు.

 There Is A Conspiracy In Guntur Stampede Nagababu Sensational Comments Details,-TeluguStop.com

చట్టరీత్యా సభలు మరియు ఊరేగింపులు జరుగుతుంటే ప్రభుత్వంకి ఎందుకంత భయమని అన్నారు.కానీ ఇటీవల దురదృష్టవశాత్తు చంద్రబాబు సభలో చనిపోవడం జరిగింది.

మాకున్న సమాచారం ప్రకారం మొదటి సభలో కంటే గుంటూరులో జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోవడం వెనకాల కుట్ర కోణం దాగివున్నట్లు నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు.

ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు రోడ్డు షో ద్వారా సభల ద్వారా తెలుసుకునే హక్కు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించింది.

దీనిని హరించడానికి మీరెవరు.?, ఏపీలో రాజరికపు పాలన సాగుతుందా.? అసలు ఇటువంటి జీవోలు న్యాయస్థానాల్లో నిలబడతాయా.? అని మండిపడ్డారు.ఈ రకంగానే గత ప్రభుత్వం టీడీపీ వ్యవహరిస్తే మీరు పాదయాత్రలు చేయగలిగేవారా.? అని వైసీపీ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube