తిరుమల( Tirumala ) శ్రీవారి సన్నిధిలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.తిరుమలలోని లడ్డూ కౌంటర్లో( Laddu Counter ) అగ్నిప్రమాదం సంభవించి భక్తులను భయాందోళనకు గురిచేసింది.
ఎల్లయ్య వద్ద ఉన్న 47వ లడ్డూ కౌంటర్ వద్ద యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్( Short Circuit ) కారణంగా మంటలు కొద్దిగా చెలరేగాయి.అయితే, అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే టీటీడీ( TTD ) అధికారులు అలర్ట్ అయ్యారు.
వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి చర్యలు చేపట్టారు.లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఉండడం సహజం కావడంతో, మంటలు చెలరేగిన క్షణాల్లోనే భక్తులు ఆందోళనకు గురయ్యారు.
అధికారులు వెంటనే మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తరువాత, భక్తుల రద్దీ పట్ల టీటీడీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.అయినప్పటికీ, లడ్డూ కౌంటర్ల వద్ద జరిగిన ఈ ఘటన ఇప్పుడు భక్తులలో ఆందోళన రేపింది.తిరుమలలో భక్తుల సురక్షితికి టీటీడీ మరింత కఠిన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.భక్తుల రద్దీ ఉండే ప్రదేశాల్లో శ్రీవారి దర్శనానికి,

అలాగే లడ్డూ కొనుగోలుకు ఏర్పాట్లు మరింత మెరుగుపర్చాలని కోరుతున్నారు.ఈ ఘటనతో భక్తులు కొద్దిసేపు అలజడికి లోనయ్యారు.టీటీడీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.భక్తులు ధైర్యంగా ఉండాలని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే తిరుమలలో, ఇలాంటి ఘటనలు భక్తుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.







