కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని విఐపి దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుని పూజారులు అందించే తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు.
అయితే కొంతమంది డైరెక్టుగా విఐపి దర్శనం ద్వారా లోపలికి వెళితే మరికొందరు సెలబ్రిటీలు కాలినడకన ద్వారా తిరుపతి కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.
ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కాలినడకన ద్వారా తిరుపతికి చేరుకొని శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.అయితే మామూలుగా సెలబ్రిటీలు నడిచి వెళ్లడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
అటువంటిది నందిని రాయి ఏకంగా మోకాళ్ళతో శ్రీవారి కొండని ఎక్కింది.అందుకు సంబంధించిన వీడియోని తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది నందిని రాయ్.
అయితే కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ అది చాలా అద్భుతమైన అనుభూతి అని రాసుకొచ్చింది నందిని రాయ్.
అంత పెద్ద సెలబ్రిటీ అయినప్పటికీ సామాన్య భక్తురాలిగా తిరుమల శ్రీవారి కొండను మోకాళ్ళతో ఎక్కడంపై పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.చాలా వరకు సామాన్య భక్తులు నడుచుకుంటూనే వెళుతూ ఉంటారు.మరి కొందరు ఈ విధంగా మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతూ శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
ఇకపోతే నందిని రాయ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారీటిని సంపాదించుకుంది.