ప్రాజెక్ట్ కె, స్పిరిట్ అంటూ పాన్ వర్లడ్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతితో ఓ చిన్న సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.రాజా డీలక్స్ అంటూ ఓ స్మాల్ బడ్జెట్ సినిమా ప్రభాస్ ఫిక్స్ చేసుకున్నాడు.
ఈ సినిమాని యువి క్రియేషన్స్, పీపుల్స్ మీడియా బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు.సినిమాకు కోసం ఓ భారీ సెట్ ని రామోజి ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా లైన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా కథ తాతా మనవళ్ల కథ అని దాన్ని థ్రిల్లర్ జోనర్ లో మారుతి చాలా ఆసక్తిగా రాసుకున్నాడని తెలుస్తుంది.
మారుతి చెప్పిన నరేషన్ నచ్చే ప్రభాస్ ఈ మూవీకి ఒప్పుకున్నాడని తెలుస్తుంది.చాలా తక్కువ రోజుల్లో చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ ఎవరన్నది తెలుస్తుంది.సలార్ టాకీ పూర్తి చేసే పనుల్లో ఉన్న ప్రభాస్ మారుతి కోసం రెండు నెలలు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.