కె.జి.ఎఫ్ రెండు పార్ట్ లతో సెన్సేషనల్ హిట్ అందుకున్న కన్నడ స్టార్ యశ్ తన నెక్స్ట్ సినిమా కన్నడ దర్శకుడు నరేన్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తర్వాత తెలుగు బడా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో యశ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.యశ్ కోసం దిల్ రాజు స్టార్ డైరక్టర్ ని సెలెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే శంకర్, రాం చరణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న దిల్ రాజు ఆ సినిమాతో పాటుగా వంశీ పైడిపల్లి దళపతి కాంబినేషన్ లో వస్తున్న వారసుడు సినిమాని కూడా భారీగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంకా చెప్పాలంటే ఈ రెండు సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో యశ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.