తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి కాజల్ అగర్వాల్ అనంతరం చందమామ మగధీర వంటి వరుస హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా కొనసాగుతున్నారు.ప్రస్తుతం ఈమె తల్లి కావడంతో సినిమాలకు విరామం చెప్పి తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తూ ఉన్నారు.
ఇక కాజల్ తల్లిగా మారిన తర్వాత ఆమెలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి.తన కొడుకు విషయంలో కాజల్ అగర్వాల్ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి ప్రజలలో మరోసారి ఆందోళన మొదలైంది.ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తం అవుతున్నారు.
ఇకపోతే కాజల్ అగర్వాల్ సైతం తల్లిగా తన కొడుకును సంరక్షించుకోవడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రోజురోజుకు దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా ఇంట్లో పసిబిడ్డ ఉండటంతో ఈమె కాలు బయటకు పెట్టాలన్న భయ పడుతున్నట్లు తెలుస్తోంది.
![Telugu Kajal, Son Love, Telugu, Tollywood, Zoom-Movie Telugu Kajal, Son Love, Telugu, Tollywood, Zoom-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/06/kajal-kept-her-family-members.jpg )
కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ చివరికి తన కుటుంబ సభ్యులతో కూడా డైరెక్ట్ గా కలిసి మాట్లాడటానికి సాహసం చేయడం లేదు.ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా తన కుటుంబ సభ్యులందరినీ దూరం పెట్టి వారితో జూమ్ మీటింగ్స్ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకుంటున్నారు.ఇలా కొడుకు పై ఉన్న ప్రేమ తో కాజల్ అగర్వాల్ ఏకంగా కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టడంతో కాజల్ కు తన కొడుకు పై ఉన్న ప్రేమ ఏంటో తెలిసిపోతుంది.ఇలా కాజల్ అగర్వాల్ కొడుకు కోసం అందరినీ దూరం పెట్టడంతో కొడుకు పై అంత ప్రేమనా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.