నేటి కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందిని జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయి.గ్యాస్ ట్రబుల్, అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం ఇలా అనేక జీర్ణ సమస్యలతో బాధ పడే వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు.
అయితే జీర్ణ సమస్యలు ఏర్పడటం అనేది మనం తీసుకున్న ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది.ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, లో ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి.
ఇక వీటిని తగ్గించుకునేందుకు పలు రకాల మందులు వాడతారు.అయితే మందులతో కాకుండా న్యాచురల్ పద్ధతుల్లోనూ.జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు.ముఖ్యంగా కిస్ మిస్ జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడంతో అద్భుతంగా సహాయపడతాయి.
కిస్ మిస్లో ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, కిస్ మిస్ను డైరెక్ట్గా తీసుకోవడం లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోడం చేయాలి.
ఇలా చేయడంలో.కిస్ మిస్లో అత్యధికంగా ఉండే ఫైబర్ తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేయడంతో పాటు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.పేగులు, పొట్టలో ఎలాంటి విష వ్యర్థాలు ఉన్నా.వాటిని తరిమికొట్టి పొట్టను శుభ్రం చేస్తుంది.అలాగే కిస్ మిస్లో ఉంటే పలు మినర్సల్ పొట్టలో యాసిడ్ లెవెల్స్ను కంట్రోల్ చేసి.ఎసిడిటీ సమస్య దరి చేరకుండా రక్షిస్తుంది.
కాబట్టి, ఎలాంటి జీర్ణ సమస్యలు ఉన్నా కిస్ మిస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఇక పిల్లలు కిస్ మిస్ను డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి, వారికి పాలలో నానబెట్టి పెడితే మంచిదంటున్నారు.కావాలనుకుంటే, పెద్దలు కూడా పాలలో నానబెట్టి తీసుకోవచ్చు.