ఎప్పుడు లేని విధంగా ఏపీ సీఎం జగన్ టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు , టీడీపీ అనుకూల మీడియా పైనా సంచలన విమర్శలు చేశారు.ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రంలో పర్యటించిన జగన్ నర్మగర్భంగా మాట్లాడారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో పాలన సాగుతోందని, మంచి జరిగితే దీవించండి అంతేకానీ ఎల్లో పార్టీ, దత్తపుత్రుడు చేస్తున్న దుర్మార్గపు ప్రచారం నమ్మవద్దని జగన్ వ్యాఖ్యానించారు.తాను మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, చంద్రబాబు అండ్ దత్తపుత్రుడు వారికి మద్దతు ఇస్తున్న ఒక వర్గం మీడియా గజ దొంగల ముఠాగా జగన్ పేర్కొన్నారు.
నవరత్నాల పాలన సాగితే తమకు డిపాజిట్లు దక్కవు అనే ఏడుపు వారిలో కనిపిస్తోందని, అందుకే ఎల్లో పార్టీ అనుబంధ పార్టీ తో కలిసి కుట్రలు చేస్తోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా హైదరాబాద్ కేంద్రంగా కలిసి కుట్రలు చేస్తున్నారని , ఇలాగే పథకాలు కొనసాగుతూ అందరికీ మేలు జరిగితే వారి బాక్స్ లు బద్దలు అవుతాయని వారికి తెలుసునని జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు కొత్త ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేస్తే శ్రీలంక, అమలు చేయకుంటే అమెరికా అవుతుందనేది వారి ప్రచారం అంటూ జగన్ విమర్శించారు. రాష్ట్ర ఖజానా దోచుకున్న దొంగలు అంటూ చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల పాలు చేశారని, అబద్ధాలు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
![Telugu Ap, Chandrababu, Jagan, Jagan Palnadu, Janasena, Janasenani, Ysrcp-Politi Telugu Ap, Chandrababu, Jagan, Jagan Palnadu, Janasena, Janasenani, Ysrcp-Politi](https://telugustop.com/wp-content/uploads/2022/04/jagan-sensational-comments-on-chandrababu-and-pawan-kalyan-detailss.jpg )
ప్రధానితో మంచి వాతావరణంలో మీటింగ్ జరిగిందని , కానీ అక్కడ సోఫా కింద కూర్చుని విన్నట్లుగా అబద్ధాలు రాస్తున్నారు అంటూ టీడీపీ అనుకూల మీడియా పై జగన్ విమర్శలు చేశారు.పెంచుకుంటే బీపీ పెరిగి గుండెపోట్లు వస్తాయని త్వరగా టికెట్ తీసుకుంటారు అంటూ జగన్ శాపనార్థాలు పెట్టారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యల పైన జగన్ స్పందించారు.
వ్యతిరేక ఓటు చీలకుండా ఏకం అవుతారని, వారి పేర్లు వేరు వేరు అయినా వారంతా ఒకటేనని ఎద్దేవా చేశారు.వాళ్ళ మాటలు నమ్మవద్దు అంటూ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.