నగరి రూరల్ VKR పురం పంచాయితీ లోని మీరాసాహెబ్ పాలెం గ్రామం ను దత్తత తీసుకొని మోడల్ గ్రామం గా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగం గా గ్రామం లోని అన్ని వీధులకు, లోపల, బయట వచ్చి వెళ్ళే దారులలో మొత్తం కలిపి 620 మీటర్లు (10 అడుగుల వెడల్పు రోడ్) ను తన సొంత నిధులు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంచనా విలువ 23.00 లక్షల రూపాయలు. (అక్షరాలా ఇరవై మూడు లక్షల రూపాయలు)తో నిర్మించనున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్ నకు భూమిపూజ చేశారు.
ఈ కార్యక్రమం లో వారి గ్రామానికి ఒక పెద్ద దిక్కులా వుండి గ్రామ బాగోగులను చూస్తున్న ఎమ్మేల్యే ఆర్కే రోజా గారికి జీవితాంతం ఋణపడి ఉంటామని గ్రామస్థులు ఎమ్మేల్యే గారికి కృతజ్ఞతలను తెలియజేశారు.