మెగాస్టార్ చిరంజీవి, మిల్క్ బ్యూటీ తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్.తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఇకపోతే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ హాజరయ్యారు.
నేడు సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో పాటు ఈనెల 15వ తేదీ నుంచి వరుస షూటింగ్ ను జరుపుకోనుంది.ఇలా అగ్ర దర్శకుల మధ్య ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో అనంతరం దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రంలో మిగిలిన తారాగణం లిస్ట్ తెలియజేశారు.
ప్రస్తుతం ఈ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మెగాస్టార్ భోళా శంకర్ సినిమాలో రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, ప్రగతి, శ్రీముఖి, తులసి, రష్మి గౌతమ్, సత్య, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శీను, ప్రభాస్ శీను వంటి వారు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు దర్శకుడు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా అనిల్ సుంకర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి సాగర్ సంగీతం వహిస్తున్నారు.ప్రస్తుతం మెగాస్టార్ నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా, మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ తో చిరు బిజీగా ఉన్నారు.