ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ టీడీపీ నడుమ ఎలాంటి వార్ నడుస్తుందో అందరికీ తెలిసిందే.కాగా మొదటి నుంచి వీరిద్దరి మధ్య ఏపీ వేదికగానే రగడ సాగింది.
అయితే వైరం కాస్తా ముదిరి చివరకు హస్తినకు చేరింది.పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
అయితే దీన్ని కాస్తా అడ్వాంటేజ్గా తీసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను, రాష్ట్రపతిని కూడాకలిశారు.
కాగా దాని మీద ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.
తమను ఇరుకున పెట్టాలని చూస్తున్న టీడీపీకి జగన్ కూడా కౌంటర్ వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా ఇపుడు వైసీపీ ఢిల్లీలో మంతనాలు మొదలెట్టేసిందతి.ఇప్పటికే విజయసాయిరెడ్డి ఢిల్లీకి చేరుకుని కార్యాచరణ మొదలెట్టేశారు.వైసీపీ ఎంపీలను కూడా సిద్ధం చేసేశారు.
కాగా టీడీపీకి కౌంటర్గా వీరు కూడా త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అపాయింట్ మెంట్ తీసుకుని టీడీపీ అరాచకాలపై కంప్లయింట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా పట్టాభి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన వీడియోను తీసుకెళ్లి రామ్నాథ్ కోవింద్ కు సమర్పించనున్నట్టు సమచారం.ఇక దాంతో పాటు తాము ముందు నుంచి అనుకున్నట్టుగానే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసే చాన్స్ ఉంది.టీడీపీ ప్రజాస్వామ్య విలువలను సర్వనాశనం చేస్తోందని అందుకే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయమని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.అంటే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టమన్నందుకు ఇప్పుడు టీడీపీని ఇరుకున పడేయాలని చూస్తోందన్నమాట వైసీపీ.
ఇలా రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి ఫిర్యాదులు చేయడం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
.