నందమూరి బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్యబాబు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తూ ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఆహా వేదికగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ అనే టైటిల్ తో రాబోతున్నట్లు సమాచారం.
టాక్ షో లో భాగంగా ప్రముఖ సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాలను ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ నటించనున్నారు.
అయితే ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు కుటుంబంలోని పలువురు హాజరవుతున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం.మెగా కుటుంబం నుంచి కాకుండా అక్కినేని నాగార్జున ఆయన పిల్లలతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అల్లుఅరవింద్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అదే విధంగా కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా పలువురు దర్శక నిర్మాతలు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించనునట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమం దీపావళి నుంచి ప్రసారం కానుందని సమాచారం వినబడుతుంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో షూటింగ్ పూర్తి చేసుకున్నారు అని, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.అయితే ఇంతకుమునుపే ఆహాలో సమంత, రానా, మంచు లక్ష్మి సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.