బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మొదటి వారం ఎలిమినేషన్స్ లో సరయు బయటకు వచ్చింది.19 మంది హౌజ్ మేట్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవగా వారిలో ఫైనల్ గా తక్కువ ఓట్స్ రావడం చేత సరయు హౌజ్ నుండి బయటకు వచ్చేసింది.ఈ క్రమంలో సరయు బయటకు వెళ్తూ బెస్ట్ ఫైవ్.వరస్ట్ ఫైవ్ గురించి చెప్పింది.
హోస్ట్ నాగార్జున ఇచ్చిన టాస్క్ ప్రకారం ముందు బెస్ట్ ఫైవ్ ను తనకు ఇచ్చిన బోర్డ్ లో వారి ఫోటోలతో చూపించింది సరయు.వారిలో శ్వేత వర్మ, మానస్, ప్రియాంకా, విశ్వ, హమిద లను చెప్పగా.
వరస్ట్ ఫైవ్ లో మాత్రం తనకు హౌజ్ లో నచ్చని వారి గురించి చెప్పింది సరయు.
వరస్ట్ ఫైవ్ లో సిరి, షణ్ముఖ్, ఆర్జే కాజల్, సన్నీ, లహరిలను ఎంపిక చేసుకుంది.
అంతేకాదు వరస్ట్ ఫైవ్ తో సరయు మాట్లాడిన విధానం ఆమెకు వారి మీద ఎంత నెగటివిటీ ఉంది అన్నది తెలుస్తుంది.ఎలిమినేట్ అయిన సరయు వెళ్తూ వెళ్తూ హౌజ్ మేట్స్ ను కడిగి పారేసిందని చెప్పొచ్చు.
సరయు ఎలిమినేట్ అవడంతో విశ్వ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు.