గత ఏడాది కంటే అంచనాలకు మించి ముప్ప గోదావరి ముంపుపై సర్కారుకు ముందుచూపు కరువయ్యింది.పోలవరం కాపర్ డ్యాం నిర్మాణం దశలో ఉండగానే గతేడాది వరదలకు అధికారులు అంచనాలు మించిన గ్రామాలు ముగ్గుల గురవడంతో మొదటి కాంటూర్ పరిది (41.15 మీటర్లు) లెక్కలన్నీ కాకిలెక్కలని తేలిపోయాయి.ప్రస్తుతం కాపర్ డ్యాం పనులు దాదాపు పూర్తి కావడంతో బ్యాక్ వాటర్ ప్రభావంతో ప్రమాదం నాలుగు రెట్లు పెరిగింది.భద్రాచలం వద్ద ప్రస్తుతం నమోదవుతున్న 13.20 అడుగుల నీటి మట్టానికి దేవీపట్నం జలదిగ్బంధమైయింది.ఆ లెక్కన మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి అంటే 43 అడుగులు వచ్చే సరికి అధికారులు అంచనాలు దాటి ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించి ముంపు బాధితులు రక్షించాలని ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు కింద గోదావరి జిల్లాలకు చెందిన ఎనిమిది మండలాల్లోని 373 గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలు నిర్వాసితులవుతాయని అధికారులు అంచనా వేశారు.గతేడాది వరదలకు తూర్పుగోదావరి జిల్లాలో మొదట కాంటూరు 41.15 మీటర్లు పరిధిలోని గ్రామాలు సైతం ముంపు బారిన పడ్డాయి.కూనవరం మండలం లోని బజ్జరాయగూడెం మొదటి కాంటూర్ పరిధిలో ఉంది.ఈ పరిధిలోని టేకులబోరు, కూనవరం, శబరికొత్తగూడెం తో పాటు 25 గ్రాములు మునిగిపోయాయి.వి.ఆర్.పురం మండలం లోని 19 గ్రామాలను మొదట కాంటూర్ పరిధిలో చేర్చారు.ఈ పరిధి లోని మరో 20 గ్రామాలకు పైగా నీటమునిగాయి.
చిత్తూరు మండలంలోని నిర్వాసిత గ్రామాల్లో అసలు మొదటి కాంటూర్ పరిధిలో చేర్చలేదు.గతేడాది వరదలకు మండల కేంద్రంతో పాటు 20 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి.
నిర్వాసితులకు నిర్లక్ష్యం తగదని 1986లో వచ్చినట్లు ఈ ఏడాది వాళ్లు వస్తాయని చెబుతున్నారు అదే జరిగితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
.