టాలీవుడ్ లో దాదాపుగా మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతున్న చిరంజీవి మరియు బాలకృష్ణలు గతంలో ఎన్నో సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.అద్బుత విజయాలను దక్కించుకున్న ఈ ఇద్దరు పోటీ పడ్డ పలు సందర్బాల్లో హోరా హోరీగా నిలిచారు.వీరు చివరి సారి ఖైదీ నెం.150 మరియు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలతో పోటీ పడ్డారు.ఆ సమయంలో రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.రెండు సినిమా లు కూడా బిగ్గెస్ట్ సక్సెస్ లను దక్కించుకున్న నేపథ్యంలో పోటీ పడ్డ ప్రతి సారి కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అఖండ మరియు ఆచార్య సినిమా లు ఈసారి మళ్లీ పోటీకి సిద్దం అవుతున్నాయి.సెకండ్ వేవ్ కారణంగా మే లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా లను వాయిదా వేశారు.
మళ్లీ ఈ సినిమా లు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దం అవుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లు రెండు కూడా దసరా సీజన్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
రెండు సినిమా లు కూడా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నాయి.ఒకటి రెండు వారాల్లో షూటింగ్ ను ముగించి ఆగస్టులో విడుదల చేయాలని ఆచార్య మేకర్స్ మొదట అనుకున్నారు.
కాని అనూహ్యంగా థియేటర్ల ఓపెన్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో దసరా కు విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు అఖండ సినిమా కూడా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఆగస్టు వరకు పూర్తి చేసి సెప్టెంబర్ లో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అందుకు దసరా సీజన్ మంచి సమయం అన్నట్లుగా వీరు భావిస్తున్నారు.అతి త్వరలోనే ఈ విషయమై మరింత క్లారిటీ రాబోతుంది.
మొత్తానికి దసరా సందర్బంగా ఒకటి రెండు రోజుల తేడాతోనే అఖండ మరియు ఆచార్య సినిమాలు వస్తాయని అంటున్నారు.